31, మార్చి 2012, శనివారం

నిన్న జరిగిన హత్యలో తెలుగు మహిళా బ్లాగర్ పాత్ర?




నిన్న జరిగిన ఒక తెలుగు బ్లాగర్ హత్య గురించి అందరికీ తెలిసే ఉంటుందనుకుంటున్నాను. అయితే ఇందులో మరొక తెలుగు మహిళా బ్లాగర్ పాత్రపై ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివరాలు ఇక్కడే అప్డేట్ చేస్తూ ఉంటా!

5, మార్చి 2012, సోమవారం

ఇంతకీ ఈ భరద్వాజులెంతమంది?










ఇదేమి తిక్క ప్రశ్ననుకుంటున్నారా? ఇది అడగదగిన ప్రశ్నే.

విషయంలోకి వెళ్ళేముందు కాస్త మొహం మీద చక్రాలేసుకుందాం - ఫ్లేష్ బేక్:


బృహస్పతి కుమారుడైన భరద్వాజుడు ఋగ్వేద శ్లోక మండలాలను వ్రాశాడని మనకు తెలిసినదే. ఆయుర్వేదం రచించింది కూడ ఆయనే.

అయితే భరద్వాజుని ప్రసక్తి త్రేతాయుగంలో రామాయణంలో పుష్పక విమానం గురించిన వర్ణనలో కనిపిస్తుంది.

అలాగే మహాభారత కాలంలో ద్రోణుని తండ్రీ, అశ్వత్థామ తాతగారు కూడా భరద్వాజుడనే అంటారు.

ఒకే వ్యక్తి మూడు యుగాల్లోనా? ఏదో తేడాగా లేదూ?

మళ్ళీ వర్తమానంలోకి వస్తే  - అక్కడే పప్పులో కాలేశాం మనం. పౌరాణికులు చెప్పేదాన్ని బట్టీ,

బర్హస్పత్య / బృహస్పత్య భరద్వాజుడు (బృహస్పతి కుమారుడు) భరద్వాజ వంశానికి, గోత్రానికి మూలపురుషుడు. వేదకాలం నాటి భరద్వాజుడు ఆయనే.

రామాయణంలో కనబడే భరద్వాజుడు పైన చెప్పిన భరద్వాజుని సంతతికి చెందినవాడు. అలాగే భారతంలో భరద్వాజుడు కూడా  అదే సంతతికి చెందిన వాడు.

కనుక మనం తరచు వినే భరద్వాజ మహర్షులు మొత్తం ముగ్గురన్నమాట. అమదులో వైమానిక శాస్త్రానికి సంబంధించిన భరద్వాజుడు రెండవ ఆయన.

మరొక కథనం ప్రకారం ఋగ్వేదపు ఆరవ మండల సృష్టికర్తలు

బర్హస్పత్య / బృహస్పత్య భరద్వాజుడు  
సుహోత్ర భరద్వాజుడు
సునహోత్ర భరద్వాజుడు
నర భరద్వాజుడు
సమ్యు భరద్వాజుడు
గార్గ భరద్వాజుడు
రజస్వన భరద్వాజుడు
పాయు భరద్వాజుడు

అయితే దీని సాధికారత నిరూపించబడవలసి ఉంది. పొద్దున్నే పప్పు నాగరాజుగారు ఒక జర్నల్ లంకె ఇచ్చారు. అది చదివి చెప్తా :)

వీరు కాక తెలుగు బ్లాగుల్లో జనాలని సాధించి, వేధించి, బాధించే భరద్వాజ ముని మరొకనున్నారు. ఆయన గారు చేసిన పుణ్యకార్యాలు తరువాయొ టపాలో :)  

3, మార్చి 2012, శనివారం

ఇప్పటి వైమానిక శాస్త్రం వ్రాసింది భరద్వాజుడేనా?







ఈ మధ్య బ్లాగుల్లో వైమానిక శాస్త్రం గురించి తెగ కొట్టుకున్నారు కదా. దానిగురించి నాకూ చందమామ రాజుగారికీ ఆఫ్లైన్లో చిన్నపాటి చర్చ జరిగింది. నాకు తెలిసింది నన్ను వ్రాయమని ఆయనకోరారు కానీ ఇప్పటిదాకా వీలవలేదు. ఇప్పుడుకూడా వ్రాయకపోతే కొడతారేమోనన్న భయంతో వ్రాసేస్తున్నా.

ఈ మధ్యకాలంలో ఈ వైమానిక శాస్త్రం గురించి చాలా చర్చే జరిగింది. దీనిగురించి నేను మొదట విన్నది 1991 లో. అప్పుడు నా మేస్టర్స్ చేస్తున్నప్పుడు ప్రాజెక్ట్ రోబాటిక్స్ లో తీసుకున్నా. విషయం పెద్దేమీలేదనుకోండి - ప్రమాదకరమైన వాతావరణంలో, కదిలే ప్రేలుడు పదార్ధాల మధ్యనుండి ఒక రోబాట్ గమనాన్ని నిర్దేశించటం. అంటే ఇప్పుడుండే వీడియో గేంస్ లో మన వైపు వచ్చే రాళ్ళని తప్పించుకుని గమ్యం చేరటం లాంటిదన్నమాట. అయితె ఇందులో నా ప్రాజెక్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాత్రమే సంబంధించింది. కనుక డైనమిక్స్ గురించి వెరే ఆల్గోరిథంస్ ని వెతుక్కోవాల్సి వచ్చింది. ఆక్రమంలో నేలమీదనుండి పైకి లేచే అవకాశాన్నికూడా పరిశీలించవలసి వచ్చింది.

మా డిపార్ట్మెంట్ హెడ్ (మా కోర్స్ మొత్తం డీ.ఆర్.డీ.ఓ. ప్రాయోజితం)  బెంగళూరు ADE లో Scientist E. అవి మన ప్రతిష్ఠాత్మకమైన తేజస్ (ఎల్.సీ.యే) ప్రాజెక్ట్  ప్రారంభదినాలు. నేనాయనతో ఈ విషయం మీద చర్చించినప్పుడు "లైబ్రరీలో భరద్వాజుని వైమానిక శాస్త్రం ఉంది, ఒకసారి వెళ్ళి చదువు. మన ఎల్.సీ.ఏ. లో కూడా దానిలో చెప్పిన సిద్ధాంతాలని వాడుతున్నారు" అన్నారు. అదే నాకు అ అపుస్తకంతో పరిచయం. కొన్ని పేజీలు తిప్పి పెద్దగా ఉపయోగం లేదనిపించి వదిలేశాను.

ఆ తరవాత సెంట్రల్ యూనివర్సిటిలో అదే సబ్జెక్ట్ ఒకసారి పరిశీలించినప్పుడు మళ్ళీ ఆ ప్రసక్తి వచ్చింది - చదవడం మొదలుపెట్టా. అయితే దానిగురించి, దాని ప్రామాణికత గురించి చాలామంది అనుమానాలు వ్యక్తం చెయ్యటం మొదలుపెట్టారు.కొన్ని ప్రయోగాలు ఫెయిల్ అయ్యాయని కూడా చెప్పారు. ఈలోగా నేను నా PhD రీసెర్చ్ ఏరియా నాలెడ్జ్ బేస్డ్ సాఫ్ట్వేర్ రివర్స్ ఎంజినీరింగ్ కి మార్హటంతో ఆ విషయం మఱుగునపడిపోయింది.

మళ్ళీ ఎన్నాళ్ళకో అప్రయత్నంగా ఆ పుస్తకం గురించి ఎక్కడో చదవటం తటస్థించింది. అప్పుడు బయటపడ్డ విషయాలు నాను కొంచం షాక్ కి గురించేశాయి ..... ముందుగా నా దృష్టినాకర్షించింది అసలు ఈ శాస్త్రం ఎలా బయటపడింది అనే విషయం. శాస్త్రం, పుస్తకం ఆహా ఓహో అంటూ గెంతులేశానేగానీ అసలది వ్రాసింది ఎవరన్న సంగతి నా మట్టిబుఱ్ఱకి తట్టనందుకు నాలుక్కఱచుకున్నా. ఈ మధ్యే పూర్తిగా చదివిన ఒక పరిశోధనా పత్రంతో నా అనుమానాలు చాలా వరకూ పటాపంచలయిపోయాయి.


సరే ఇక అసలు విషయంలోకి వస్తే. ఈ వైమానిక శాస్త్రం బయటపడింది 1900 తరవాత - అదికూడా ఎలా అంటే సుబ్బరాయ శాస్త్రి అనే ఆయనకి మహర్షి భరద్వాజుడు కలలోనో లేక టెలీపతీ ద్వారానో బోధించాడని! దాని గురించి మరిన్ని విషయాలు సేకరించటం మొదలుపెట్టా.


ఈ సుబ్బరాయశాస్త్రి అనేఆయన కర్ణాటకలోని ఆనేకాల్ అనే ఊరిలో నివశించిన ఒక తాంత్రికుడు. తనకి తోచినప్పుడల్లా ఆశువుగా శ్లోకాలు చెప్పేవాడు. ఆ క్రమంలో వెంకటాచలశర్మ అనే ఆయనకి తనకు భరద్వాజుడు చెప్పాడని ఈ వైమానిక శాస్త్ర స్లోకాలను ఉపదేశించాడు. ఆ వెంకటాచశర్మ వ్రాసిన ప్రతులు బరోడాలోని ఒక లైబ్రరీలో ఉన్నట్టుండి ప్రత్యక్ష్యమయ్యాయి. వాటీని జోస్యర్ అనే ఆయన 1959 లో ఆంగ్లంలోకి అనువదించాడు. ఆ తరవాత అది వేరేవారిద్వారా 8 అంశాలున్న పుస్తకంగా బయటకొచ్చింది. ఆ పుస్తకంలో కనబడే బొమ్మలు గీసింది ఎల్లప్ప అనే ఆయన.  


దీనికి పురిట్లోనే సంధికొట్టింది. భరద్వాజుడు శాస్త్రిగారికి కలలో కనిపించి చెప్పటం, దానిని ఆధారంగా చేసుకుని జానాలు పుస్తాకాలు వ్రాసెయ్యటం కొంతమందికి మింగుడిపడలేదు.

1974 లో ఐ.ఐ.ఎస్.సీ కొ సంబంధించిన కొందరు పరిశొధకులు ఈ పుస్తకాని క్షుణ్ణంగా పరిశీలించి పరిశోధించారు.  ఆ పేపర్ చదవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.


వారందించిన వివరాలిలా ఉన్నాయి:


1. As already stated, the authorship of the work has been attributed to Maharshi Bharadwaja. Whether this Maharshi is the same as one of the seven seers (Saptarshis) is by no means substantiated. Thus the question of authorship remains as yet unanswered


అంటే ఇది భరద్వాజుడు వ్రాసింది కాదనేగా? అన్నట్టు ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే ప్రతీదానికి ఆధారాలడిగేవారు అసలు ఇది భరద్వాజుడు వ్రాసిందా కాదా అని తెలుసుకోకుండానే "వేదాల్లో తప్పులున్నాయోచ్" అని టాం టాం చెయ్యటం. అలాగే మన వేదోఫాసకులు కూడ ఎవరు వ్రాశారన్నది తెలుసుకోకుండా "ఇదిగో వేదాలలో సైన్సుకి నిరూపణ" అని ఎగరటం.

(అసలీ "భరద్వాజ" అనేదే పెద్ద తేడా పేరని నా ఉద్దేశ్యం. ఏమంటారు?)

2. The kind of Sanskrit used in the text may indicate whether or not the text is of Vedic origin. The text contains Shlokas set to Anushtrup metre and its language is quite simple and modern. Again, in its  introduction, BVS mentions that a few words did have a structure similar to that of the Vedic Sanskrit. The number of such words being very small, and their usage being incidental, it appears appropriate to conclude that the Sanskrit used in the text is modern.



దీనర్థం మన విశాఖపట్నం భాషలో చెప్పాలంటే అతి పెద్ద "కిట్టింపు" జరిగిందనేగా? అయితే వీరు ఒక మాట మాత్రం చెబుతున్నారు. దొరిన వ్రాత ప్రతులు వేదకాలం నాటివి కావని అందరూ ఒప్పుకున్నారనీ, ఆ విషయానికి సంబంధించి ఫ్రాడ్ ఏదీ లేదనీనూ.

3. Another significant point is the almost complete absence of any mention of use of aircraft in the innumerable Sanskrit texts of the post‐Vedic age. One text, namely “Samarangana Sutradhara”, by Bhoja deals with some description of aircraft, but does not quote any earlier work. What is more, Bhoja states that detailed description of their construction and other features will not be given lest the same be used for evil purpose by people?

4. A few lines have been devoted to the function of wings and tail and they appear to be incorrect ...... It appears that great importance is given to the tail portion for the generation of lift. Also the function of the hinge wings becomes unclear in this context. It may be noted that it is the wings which should contribute to the life of the craft and the tail portion to its controllability.

5. The height and width of the craft, in our opinion, are in such proportion as to put its stability in serious question. There are inconsistencies in the dimensions mentioned in the verses and those given in the
drawings.

శ్లోకాలకీ ఎల్లప్పగారి బొమ్మలకీ తేడాలున్నయంటే, ఎల్లప్పగారు కావాలనే ఆ మార్పులు చేశారనా?

6. There are no statements on the capabilities of this craft ... The author – whoever he be – shows a complete lack of understanding of the dynamics of the flight of heavier‐than‐air craft.

7.  The text and the drawings do not correlate with each other even thematically. The drawings definitely point to a knowledge of modern machinery. This can be explained on the basis of the fact that Shri Ellappa who made the drawings was in a local engineering college and was thus familiar with names and details of some machinery.

టూకీగా చెప్పాలంటే వైమానిక శాస్త్రం అసలు శాస్త్రమేకాదని కొట్టీపారేశారు పై పరిశోధకులు. అది భరద్వాజుడూ వ్రాసినదికాదు అని కూడా చెప్పకనే చెప్పారు. అయితే కొంతమంది శాస్త్రవేత్తలు మాత్రం అందులో చెప్పబడిన కొన్ని మాత్రం పనిచేశాయని నాతోనే ఒప్పుకున్నారు.  దీన్ని బట్టీ తేలుతోందేమిటంటే భరద్వాజుని పేరుతో ఉన్న వైమానిక శాస్త్రం భరద్వాజుడు వ్రాసినది కాకపోవచ్చనీ, అందులో చాలా విషయాలు అమలుకు నోచుకోవని అయితే కొన్నిటిని అమలు పఱచటానికి మాత్రం అవకాశం ఉందనీనూ!



అయితే ఈ సందర్భంగా తాడేపల్లిగారు శ్రీకృష్ణదేవరాయలు వ్రాసిన వైమానిక శాస్త్రం గురించి ఎక్కడో అన్నారు. భోజుడు వ్రాసిన దానిని గురించి విన్నానుగానీ ఈ ఆంధ్రభోజుడు వ్రాసినదాని గురించి నేనెప్పుడూ వినలేదు. దీనిసంగతి ఆయన్ని అడగాలి. అలాగే భరద్వాజుడు వ్రాసినదానికి అనువాదం కూడా ఉందన్నారు (నేను పైన చర్చించిన అనువాదం కాకపోతేనే). వాటిని గురించి ఆయనను కనుక్కోవాలి.



టూకీగా చెప్పాలంటే ఈ ఫేక్ శాస్త్రాన్ని (ఫేక్ అయితేనే) వదిలిపెట్టి అసలు శాస్త్రం కోసం అన్వేషణ సాగించాల్సిన సమయం ఆసన్నమైంది.